ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ఈ నెల (జనవరి) 13న వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగనున్నాయి. కాణిపాకం లోని స్థానిక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజస్వామి ఆలయంలో ఈనెల 13న వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయని చైర్మన్ మోహన్రెడ్డి, ఈవో వెంకటేశు తెలిపారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన రజక సేవా సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరిస్తారని వారు తెలిపారు. ఈ సందర్భంగా.. బుధవారం వరదరాజస్వామి ఆలయానికి చైర్మన్, ఈవోలు పట్టు వస్త్రాలను అందజేస్తారు. ఈ ఘట్టంలో ప్రధానమైన శ్రీదేవి, భూదేవి సమేత వరదరాజ స్వామికి ప్రాకారోత్సవం జరగనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ