ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మంగళవారం ఉదయం తాడేపల్లిలోని ఆయన నివాసంలో విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కలిశారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి సీఎంకు అందించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కు స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వేద ఆశీర్వచనం అందజేశారు. సీఎంను కలిసినవారిలో స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో పాటుగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ఉన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ