తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్ళికి హాజరై ఇంటికి వెళ్తున్న సమయంలో వ్యాన్ బోల్తా పడింది. జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర ఆలయం ఘాట్ రోడ్డులో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యానులో 20 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తుంది. వ్యాను అదుపుతప్పి మెట్ల మార్గం ద్వారా బోల్తా పడడంతో మరికొందరు కూడా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గురైన వారు రాజానగరం మండలం వెలుగుబంద, గోకవరం మండలం ఠాకూర్పాలెంకు చెందిన వారుగా గుర్తించారు. మరోవైపు సమాచారం అందిన వెంటనే పోలీసులు, స్థానిక అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu