ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు, ఎల్లుండి (సెప్టెంబర్ 27, 28 తేదీల్లో) తిరుమలలో పర్యటించనున్నారు. తిరుమలలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల తొలిరోజు అనగా సెప్టెంబర్ 27, మంగళవారం ధ్వజారోహణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే బుధవారం నంద్యాల జిల్లాలో రామ్కో సిమెంట్స్ ఫ్యాక్టరీలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్:
సెప్టెంబర్ 27 సాయంత్రం 3.45 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి సీఎం బయలుదేరి, 5.20 గంటలకు తిరుపతి గంగమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అలిపిరి చేరుకుని తిరుమలకు విద్యుత్ బస్సులను ప్రారంభిస్తారు. రాత్రి 7.45 గంటలకు తిరుమలలో బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని, అక్కడి నుంచి బయలుదేరి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామిని దర్శించుకుంటారు. రాత్రికి తిరుమలలోనే బసచేస్తారు.
ఇక సెప్టెంబర్ 28, బుధవారం ఉదయం 6.05 గంటలకు స్వామివారిని దర్శించుకున్న అనంతరం నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. 7.10 గంటలకు టీటీడీ కోసం వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిర్మించిన లక్ష్మి వీపీఆర్ రెస్ట్ హౌస్ను ప్రారంభిస్తారు. అనంతరం 9.55 గంటలకు రేణిగుంట ఎయిర్పోర్ట్ నుంచి ఓర్వకల్ బయలుదేరుతారు.
నంద్యాల పర్యటన:
బుధవారం ఉదయం 10.55 గంటలకు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల చేరుకుని రామ్కో సిమెంట్స్ ఫ్యాక్టరీలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.05 గంటలకు ఓర్వకల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి, 2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY