నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న వంగవీటి రాధా

Vangaveeti Radha Participates in TDP Leader Nara Lokesh's Yuvagalam Padayatra Today,Vangaveeti Radha Participates in Yuvagalam Padayatra,Nara Lokesh's Yuvagalam Padayatra,Vangaveeti Radha in TDP Padayatra,Mango News,Mango News Telugu,Vangaveeti Radha meets TDP leader,Vangaveeti Radha expresses solidarity,Vangaveeti Radha Walked With Nara Lokesh,Vangaveeti Radha Joined in Lokesh Yuvagalam,Vangaveeti Radha meets Lokesh,AP Politics,AP Latest Political News,AP Latest News and Live Updates

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మార్చి 7, మంగళవారం యువగళం పాదయాత్రలో (37వ రోజు) భాగంగా విజయవాడ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పాల్గొన్నారు. నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న వంగవీటి రాధా, లోకేష్ యువగళం యాత్రకి సంఘీభావం తెలిపారు. కలికిరి వద్ద ఇద్దరు నేతలు కలిసి ఉత్సాహంగా పాదయాత్ర చేస్తుంటే, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వారిని అనుసరిస్తూ నినాదాలు చేశారు. నడుస్తున్న సమయంలో నారా లోకేష్, రాధా పలు అంశాలపై చర్చించుకోవడం కనిపించింది. కాగా ఇరువురూ నేతలు ప్రత్యేకంగా సమావేశమై, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

మరోవైపు కొంతకాలంగా వంగవీటి రాధా పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా రాధా జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే తాజాగా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపడంతో, ఈ భేటీ చర్చనీయాంశమైంది. లోకేష్ ను కలవడంతో వంగవీటి రాధా టీడీపీలోనే కొనసాగునున్నారనే సంకేతాలు ఇచ్చినట్టుగా చర్చ జరుగుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + seven =