టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మార్చి 7, మంగళవారం యువగళం పాదయాత్రలో (37వ రోజు) భాగంగా విజయవాడ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా పాల్గొన్నారు. నారా లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్న వంగవీటి రాధా, లోకేష్ యువగళం యాత్రకి సంఘీభావం తెలిపారు. కలికిరి వద్ద ఇద్దరు నేతలు కలిసి ఉత్సాహంగా పాదయాత్ర చేస్తుంటే, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు వారిని అనుసరిస్తూ నినాదాలు చేశారు. నడుస్తున్న సమయంలో నారా లోకేష్, రాధా పలు అంశాలపై చర్చించుకోవడం కనిపించింది. కాగా ఇరువురూ నేతలు ప్రత్యేకంగా సమావేశమై, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మరోవైపు కొంతకాలంగా వంగవీటి రాధా పార్టీ మారతారని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా రాధా జనసేన పార్టీలోకి వెళ్లే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే తాజాగా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపడంతో, ఈ భేటీ చర్చనీయాంశమైంది. లోకేష్ ను కలవడంతో వంగవీటి రాధా టీడీపీలోనే కొనసాగునున్నారనే సంకేతాలు ఇచ్చినట్టుగా చర్చ జరుగుతుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE