సంక్రాతి పండగ సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రణాళికలు రూపొందిస్తుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మొత్తం 6400 ప్రత్యేక సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ నడపనుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. సంక్రాంతికి ముందు అనగా జనవరి 6 నుంచి 14 వరకు 3,120 ప్రత్యేక బస్సులు, సంక్రాంతి పండుగ తరువాత తిరుగు ప్రయాణం కోసం జనవరి 15 నుంచి 18 వరకు 3,280 నడుస్తాయని, మొత్తం కలిపి 6400 బస్సులు నడిపేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.
కాగా ఈ ప్రత్యేక బస్సుల్లో గత దసరా పండుగ సందర్భంలో లాగానే ప్రయాణికుల నుంచి సాధారణ ఛార్జీలనే వసూలు చేయనున్నామని, ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. అదేవిధంగా ప్రయాణికులు అప్ అండ్ డౌన్ (ఒకేసారి రానుపోను) బస్ టికెట్లు బుక్ చేసుకుంటే 10 శాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీ డిమాండ్ కు అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపనున్నామని పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారు, రాష్ట్రంలో జిల్లాల మధ్య ప్రయాణించే వారు ఏపీఎస్ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సులు వివరాలు:
- హైదరాబాద్ తో పాటుగా తెలంగాణలోని ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 3,600 బస్సులు
- బెంగళూరు నుంచి ఏపీకి 430 బస్సులు
- చెన్నై నుంచి ఏపీకి 150 బస్సులు
- ఏపీలోని ఇతర జిల్లాల నుంచి విజయవాడకు 800 బస్సులు
- ఏపీలోని ఇతర జిల్లా నుంచి విశాఖపట్నంకు 450 బస్సులు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE