తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా నమోదవుతున్నాయి. ఆగస్టు 8, శనివారం రాత్రి 8 గంటల నాటికీ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,495 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో పేర్కొంది. గురువారం నాడు కొత్తగా 1982 కేసులు నమోదవగా, 22,925 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 12 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 627 కి పెరిగింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 55,999 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 22,869 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 70.44 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.78 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1982):
- జీహెచ్ఎంసీ – 463
- మేడ్చల్ – 141
- రంగారెడ్డి జిల్లా – 139
- కరీంనగర్ - 96
- జోగులాంబ గద్వాల – 93
- జనగామ – 78
- పెద్దపల్లి – 71
- వరంగల్ అర్బన్ – 71
- భద్రాద్రి కొత్తగూడెం – 64
- కామారెడ్డి – 62
- నల్గొండ – 59
- నిజామాబాద్ – 58
- సిద్ధిపేట – 55
- సంగారెడ్డి – 49
- నిర్మల్ – 47
- ఖమ్మం – 47
- మహబూబ్ నగర్ – 43
- జగిత్యాల – 42
- వరంగల్ రూరల్ – 40
- మంచిర్యాల – 31
- రాజన్న సిరిసిల్ల – 29
- వనపర్తి – 28
- మెదక్ – 26
- నాగర్ కర్నూల్ – 23
- ములుగు – 21
- జయశంకర్ భూపాలపల్లి – 21
- సిద్ధిపేట – 20
- మహబూబాబాద్ -17
- యాదాద్రి భువనగిరి – 16
- ఆదిలాబాద్ – 12
- వికారాబాద్ – 10
- ఆసిఫాబాద్ – 7
- నారాయణ్ పేట్ – 3
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu