స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్, డెఫిలింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ శుక్రవారం ఉదయం సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఇటీవల బ్యాంకాక్లో జరిగిన థామస్ కప్ విజయంలో ఏపీకి చెందిన కిదాంబి శ్రీకాంత్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అలాగే కర్నూలుకు చెందిన టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రిన్ బధిరుల ఒలంపిక్ క్రీడల్లో కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా కిదాంబి శ్రీకాంత్ ను, షేక్ జాఫ్రిన్ను సీఎం వైఎస్ జగన్ అభినందించి, శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.
అంతర్జాతీయ వేదికలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను వెలుగెత్తిచాటడంపై జాఫ్రిన్ను సీఎం ప్రశంసిస్తూ, అర్హతలను బట్టి షేక్ జాఫ్రిన్కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే అంతర్జాతీయ వేదికలపై ప్రతిభను చాటిన ఏపీ క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం కూడా అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ పర్యాటక, యువత అభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా, శాప్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF