పెద్ద ఎత్తున సిట్టింగ్లను పక్కకు పెట్టేస్తుండడంతో వైసీపీలో అసంతృప్తి బుసలు గక్కుతోంది. టికెట్ దక్కని సిట్టింగ్లు.. టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా పార్టీని వీడుతున్నారు. ఈక్రమంలో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో.. కర్నూల్ ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి కర్నూల్ ఎంపీ సీటు కోసం కొత్త వ్యక్తిని వెతికే పనిలో ఉన్నారు. ఈక్రమంలో జగన్ పలువురి పేర్లను పరిశీలించగా.. చివరికి మంత్రి గుమ్మనూరు జయరాం పేరు ఎక్కువగా వినిపించింది.
గమ్మనూరు జయరాంను కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించారు. కానీ జయరాంకు కర్నూల్ నుంచి లోక్సభకు పోటీ చేయడం ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే తనకు ఆలూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని అసెంబ్లీ వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారు. చివరి తన కొడుక్కి ఆలూరి టికెట్ ఇచ్చినా.. తాను కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని హైకమాండ్కు చెప్పేశారు. కానీ అప్పటికే ఆలూరు నియోజకవర్గానికి అభ్యర్థికిగా జెడ్పీటీసీ విరూపాక్షను జగన్ కేటాయించారు. ఈక్రమంలో జయరాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
దీంతో జగన్ కర్నూల్ నుంచి కొత్త వ్యక్తిని బరిలోకి దింపాలని కసరత్తు చేస్తున్నారు. బలమైన వ్యక్తికోసం వెతుకులాట ప్రారంభించారు. ఈసమయంలో మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు తెరపైకి వచ్చింది. ఆమెను కర్నూల్ నుంచి బరిలోకి దింపాలని జగన్ అనుకుంటున్నారట. 2014లో బుట్టా రేణుక వైసీపీ తరుపున కర్నూల్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కొద్దిరోజులకు టీడీపీలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో.. తిరిగి సొంతగూడు అయిన వైసీపీలో చేరారు.
ఈక్రమంలో మరోసారి కర్నూల్ నుంచి బుట్టా రేణుకను బరిలోకి దింపాలని జగన్ కసరత్తు చేస్తున్నారట. ఇప్పటికే ఈ విషయంపై రేణుకతో కూడా చర్చలు జరిపినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అటు బుట్టా రేణుక కూడా కర్నూల్ నుంచి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY