పెనమలూరు టీడీపీ టికెట్ దక్కేదెవరికి?

Penamaluru, TDP, Penamaluru TDP Ticket, Who will get Penamaluru TDP Ticket, Chandrababu Naidu, AP Elections, MLA Kolusu Parthasarathy, Chandrababu Naidu, YSRCP, Lok Sabha elections, Andhra Pradesh News Updates, AP Political News, Mango News Telugu, Mango News
penamaluru, tdp ticket, Chandrababu Naidu, AP Elections

ఎన్నికలు ముంచుకొస్తున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్‌లు స్పీడ్ పెంచేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జగన్.. 58 అసెంబ్లీ స్థానాలకు, 10 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇటు టీడీపీ మూడు స్థానాలు, జనసేన రెండు స్థానాలను ప్రకటించింది. ఈ సమయంలో పెనమలూరు నియోకజకవర్గం పేరు గట్టిగా వినిపిస్తోంది.

టీడీపీ కంచుకోట అయిన పెనమలూరును ఈసారి ఎలా అయినా దక్కించుకోవాలని జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు పెనమలూరు అభ్యర్థిని కూడా ఖరారు చేశారు. మంత్రి జోగి రమేష్ గౌడ్‌ను పెనమలూరు అభ్యర్థిగా ప్రకటించారు. పెనమలూరులో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. అందుకే అదే సామాజిక వర్గానికి చెందిన రమేష్ గౌడ్‌ను జగన్ బరిలోకి దింపారు.  అయితే ఇప్పుడు వైసీపీ జోగి రమేష్ గౌడ్‌ను పెనమలూరు అభ్యర్థిగా ప్రకటించడం తెలుగు దేశం పార్టీకీ తలనొప్పిగా మారింది.

పెనమలూరు టికెట్‌ను టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆశిస్తున్నారు. హైకమాండ్ తనకే టికెట్ ఇస్తుందనే నమ్మకంతో ప్రసాద్ నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టారు. ప్రజలకు దగ్గరగా ఉంటూ అన్ని నియోజకవర్గాలను కలుపుకొని పోతున్నారు. ప్రతి గడప గడపకూ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఎలాగూ పెనమలూరు టీడీపీకి కంచుకోట కాబట్టి గెలిచి తీరుతానని బోడే ప్రసాద్ ధీమాతో ఉన్నారు. అయితే అటు టీడీపీ హైకమాండ్ కూడాబోడే ప్రసాద్ వైపే మొగ్గుచూపింది. కానీ ఇప్పుడు ఆయనకు ప్రసాద్‌కు టికెట్ ఇచ్చేందుకు ఇప్పుడు ఆయన సామాజిక వర్గం అడ్డు వస్తోంది.

పెనమలూరులో బీసీ ఓటర్లు ఎక్కువ కాబట్టి వైసీపీ హైకమాండ్ అదే సామాజిక వర్గానికి చెందిన జోగి రమేష్‌ను బరిలోకి దింపింది. దీంతో ఇప్పుడు చంద్రబాబు కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపాల్సి వస్తోంది. మరోవైపు పార్టీ కోసం ఎంతో కష్టపడి.. ప్రజాల్లోకి వెళ్తున్న బోడే ప్రసాద్‌ను కాదనలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బోడే ప్రసాద్ పెనమలూరు టికెట్ తనకే ఇవ్వాలని హైకమాండ్ వద్ద ప్రపోజల్ పెట్టారు. మరి చివరికి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు? బోడే ప్రసాద్‌కే టికెట్ ఇస్తారా? లేదా పక్కకు పెడుతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 5 =