ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 147 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 15, సోమవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,92,008 కు చేరింది. గత 24 గంటల్లో మరో 103 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయినట్టు తెలిపారు. ఇక కరోనా వలన కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7185 కి పెరిగింది. గత 24 గంటల్లో 22604 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా, మొత్తం పరీక్షల సంఖ్య 1,45,57,366 కు చేరుకుంది.
ఏపీలో కరోనా కేసులు వివరాలు (మార్చి 15, ఉదయం 10 గంటల వరకు) :
- రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు : 8,92,008
- కొత్తగా నమోదైన కేసులు : 147
- కొత్తగా నమోదైన మరణాలు : 1
- డిశ్చార్జ్ అయిన వారి మొత్తం సంఖ్య : 8,83,380
- యాక్టీవ్ కేసులు : 1443
- మొత్తం మరణాల సంఖ్య : 7185
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ