ఏపీలో ఎన్నికల వేడి భానుడి భగభగలతో పోటీ పడుతోంది. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలతో కలిపి నాలుగో దశలో పోలింగ్ జరగనుండటంతో అన్ని పార్టీల నేతల ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ రానుండటంతో.. రాష్ట్రంలోని అన్ని కీలక పార్టీల నేతల హామీలు, ప్రత్యర్ధుల మీద పదునైన విమర్శలతో తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు.
దాదాపు అన్ని పార్టీల అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో ఆ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన నేతల మధ్య పెద్ద మాటల యుద్దం నడుస్తుంది. మరోవైపు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కీలక నేతలను గెలిపించుకోవడానికి వారి భార్యలు కూడా రంగంలోకి దిగారు. ఇప్పటి వరకూ ఎప్పుడు కూడా ఏ పార్టీ కార్యక్రమంలో కూడా పాల్గోనని వారంతా ఈ సారి తమ భర్త గెలుపు కోసం ప్రత్యక్ష్యంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ను పులివెందులలో మరోసారి గెలిపించాలంటూ జగన్ భార్య.. వైఎస్ భారతి గడప గడపకు ప్రచారం చేస్తున్నారు.
మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుని కుప్పంలో మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించడానికి చంద్రబాబు బాబు భార్య భువనేశ్వరి కూడా ప్రత్యక్ష ప్రచారంలో పాల్గొంటున్నారు. అలాగే.. గతంలో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన నారా లోకేష్ను.. ఈ సారి ఎలాగైనా గెలిపించాలనే తపనతో ఉన్న లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా మంగళగిరిలో పర్యటిస్తూ.. తన వంతు ప్రచారం చేస్తున్నారు.
వీరే కాకుండా హిందూపురంలో మరోసారి బాలకృష్ణను గెలిపించుకోవడానికి బాలయ్య భార్య వసుంధర కూడా తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఇక నలుగురు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్య నేతలు కావడంతో.. వారంతా తమ తమ నియోజకవర్గాలతో పాటు ఇతర నియోజకవర్గాల్లో కూడా విస్తృత ప్రచారం చేస్తూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు. దీనికితోడు ఆ సమయంలో ఆ నాయకులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో వారి సతీమణులు ప్రచారంలో పాల్గొని కార్యకర్తల్లోనూ, ఆయా శ్రేణుల్లోనూ జోష్ నింపుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY