బెంగళూరు ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్

YCP MP Vijaya Sai Reddy Visits Taraka Ratna at Bengaluru Hospital Gives Key Updates About His Health Condition,Ycp Mp Vijaya Sai Reddy,Visited Tarakaratna In Bangalore Hospital,Important Update On Health Condition,Mango News,Mango News Telugu,Nandamuri Tarakaratna Health Condition,Janasena Chief Pawan Kalyan,Wishes Nandamuri Taraka Ratna,Taraka Ratna for Speedy Recovery,Mango News,Mango News Telugu,Nandamuri Taraka Ratna,Nandamuri Taraka Ratna Latest News and Updates,Nandamuri Taraka Ratna Health,Nandamuri Taraka Ratna Health Status,Nandamuri Taraka Ratna Latest Updates,Nandamuri Taraka Ratna Health Updates,Nandamuri Taraka Ratna Latest Updates,Yuvagalam Padauatra

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి నందమూరి తారకరత్నను పరామర్శించారు. కాగా ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్నకు భార్య తరపు బంధువు అవుతారు. ఈ క్రమంలో ఆయన బుధవారం నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న తారకరత్నను చూడటానికి బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా తారకరత్న కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అలాగే వైద్యులతో మాట్లాడి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ క్లిష్ట పరిస్థితుల్లో తారకరత్నకు ఆయన బాబాయి నందమూరి బాలకృష్ణ అండగా ఉన్నారని, ఆస్పత్రి వైద్యులతో పర్యవేక్షిస్తూ దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారని, అందుకు బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు విజయసాయి రెడ్డి.

ఈ సందర్భంగా ఆస్పత్రి ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ ఎంపీ విజయసాయి రెడ్డి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఆయనేమన్నారంటే.. ‘ప్రస్తుతానికి తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. గుండెపోటు వచ్చినప్పుడు దాదాపు 45 నిమిషాలు గుండె ఆగిపోయిందని, దానివలన మెదడులో పైవైపు భాగం కొంత దెబ్బతిందని వారు తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో నీరు చేరి మెదడులో వాపు చోటుచేసుకుంది. దీనికే ఇప్పుడు డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అయితే గుండె బాగానే పనిచేస్తుందని డాక్టర్లు చెప్పడం శుభపరిణామం. ఇక వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు. తారకరత్న త్వరలోనే కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వస్తారు’ అని విజయసాయి రెడ్డి తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 15 =