కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఉదయం లోక్ సభలో కేంద్ర బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2023-24 కేంద్ర బడ్జెట్ మొత్తం వ్యయం రూ.45 లక్షల కోట్లుగా అంచనా వేయగా, రుణాలు కాకుండా మొత్తం వసూళ్లు రూ.27.2 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ బడ్జెట్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన పలు సంస్థలకు కూడా కేటాయింపులు చేశారు.
ఆంధ్రప్రదేశ్:
- ఏపీ సెంట్రల్ యూనివర్శిటీకి రూ.47 కోట్లు
- పెట్రోలియం యూనివర్సిటీకి రూ.168 కోట్లు
- వైజాగ్ స్టీల్ ప్లాంట్కు రూ.683 కోట్లు.
తెలంగాణ:
- సింగరేణి సంస్థకు రూ.1,650 కోట్లు
- ఐఐటీ హైదరాబాద్ కు రూ.300 కోట్లు
- మణుగూరులోని హెవీ వాటర్ ప్లాంట్ కు రూ.1,473 కోట్లు.
ఏపీ, తెలంగాణకు వచ్చిన ఉమ్మడి కేటాయింపులు:
- ఆంధ్రప్రదేశ్ లోని మంగళగిరి ఎయిమ్స్, తెలంగాణ లోని బీబీనగర్ ఎయిమ్స్ సహా దేశంలోని 22 ఎయిమ్స్ వైద్య సంస్థల కోసం రూ.6,835 కోట్లు కేటాయింపు.
- గిరిజన యూనివర్సిటీలకు రూ.37 కోట్లు కేటాయింపు
- హైదరాబాద్ లోని సాలార్ జంగ్ మ్యూజియం సహా అన్ని మ్యూజియంలకు రూ.357 కోట్లు కేటాయింపు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE