రాజకీయాలు.. అనిశ్చితికి మారుపేరు. ఎప్పుడైనా, ఏమైనా జరగొచ్చు. ఓడలు బండ్లు అవ్వొచ్చు.. అలాగే, బండ్లు ఓడలు కావచ్చు. ఇంకోలా చెప్పాలంటే, ఇప్పుడు మిత్రులు అనుకున్నవాళ్ళు భవిష్యత్తులో శత్రువులుగా మారొచ్చు.. అలాగే, ఇప్పుడు శత్రువులుగా కత్తులు దూసుకుంటున్న వాళ్ళు రేపు మళ్ళీ మిత్రులుగానూ మారొచ్చు.. మరి, రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు సంచలనంగా మారనున్నాయా? ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు వైఎస్ షర్మిల ఈ సంచలనాలకు కేంద్రబిందువు కానున్నారా? తాజాగా, జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే, ఏమైనా జరగొచ్చు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఏపీలో కూడా పార్టీ పెడతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో.. వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై మీడియా అడిగిన ప్రశ్నకు షర్మిల వ్యూహాత్మకంగా సమాధానం ఇచ్చారు. గత కొంత కాలంగా సోదరుడు జగన్ తీరుపై షర్మిల ఆగ్రహంగా ఉన్నారు. ఈ మధ్య పులివెందుల వెళ్లినప్పుడు కూడా జగన్, షర్మిల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుందనే వార్త బయటకొచ్చింది. జగన్ ఏపీలో ఉండి ఇక్కడ తెలంగాణలో తనకు నష్టం కలిగిస్తున్నారని షర్మిల అభిప్రాయం పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, ఏపీలో కూడా షర్మిల పార్టీ పెడతారంటూ ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై మీడియా అడిగిన ప్రశ్నకు.. వైఎస్ షర్మిల నిగూఢంగా సమాధానం ఇచ్చారు. రాజకీయ పార్టీ ఎప్పుడైనా పెట్టవచ్చు, ఎక్కడైనా పెట్టవచ్చు… పెట్టకూడదనే రూల్ ఏమీ లేదుకదా? అని వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ