దక్షిణాఫ్రికాలోని 1880ల కాలం నాటి చారిత్రాత్మక పార్లమెంట్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కేప్ టౌన్లోని ఓల్డ్ పార్లమెంట్ బిల్డింగ్ మూడవ అంతస్తులో చెలరేగిన మంటలు.. పెద్ద ఎత్తున ఎగసిపడి పక్కనే ఉన్న ప్రస్తుత పార్లమెంట్ నేషనల్ అసెంబ్లీ భవనానికి వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో ప్రతిష్టాత్మక పార్లమెంట్ భవనం పైకప్పు కూలిపోయింది. జనవరి 2వ తేదీ ఉదయం 6 గంటల సమయంలో ప్రమాదం సంభవించింది. మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. కాగా, ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగక పోవడం ఒక్కటే అందరికీ ఊరటనిచ్చే విషయం.
దక్షిణాఫ్రికా పార్లమెంట్ స్పీకర్ ‘నొసివివే’ ప్రమాదంపై స్పందించారు. ఈ మంటలు ప్రమాదవశాత్తు చెలరేగాలయా లేక విద్రోహ చర్యా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. మంటల ధాటికి కాంప్లెక్స్లోని మిగతా భవనాలు, వాటిలోని విలువైన వస్తుసముదాయం దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ‘సిరిల్ రమఫోసా’ కూడా సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం, ‘రమఫోసా’ విలేకరులతో మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో ఇలా జరగటం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. కాగా, దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరుపుతామని ప్రకటించారు. ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ