వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా విశాఖలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మార్గాల అన్వేషణ, తీరప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు రెండు వారాలపాటుగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోసం హైదరాబాద్ సీబీఐ కోర్టును విజయసాయిరెడ్డి కోరారు. దుబాయ్, బాలి, మాల్దీవులకు వెళ్లనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబరు చివరిలోగా 2 వారాలపాటుగా దుబాయ్, మాల్దీవులు మరియు బాలి పర్యటనకు వెళ్లడానికి సీబీఐ కోర్టు ఎంపీ విజయసాయిరెడ్డికి అనుమతి జారీ చేసింది. అలాగే రూ.5 లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ