గత రెండు సీజన్లుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న, బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ జూలై 21 నాడు ప్రారంభమైంది. ఈ సీజన్ కి వ్యాఖ్యాతగా కింగ్ అక్కినేని నాగార్జున వ్యవరిస్తున్నారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో 15 మంది సభ్యులు బిగ్ బాస్ ఇంటిలోకి ఎంటరయ్యారు. మొదటగా నటి హేమ ఎలిమినేట్ అవ్వగా వైల్డ్ కార్డు ఎంట్రీగా తమన్నా సింహాద్రి ఇంటిలోకి వచ్చింది, తరువాత జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. జాఫర్ ఎలిమినేషన్ తో ఇంటిలో 14 మంది సభ్యులున్నారు. ఆగస్టు 5న ప్రసారమైన బిగ్ బాస్-3 పదహారో ఎపిసోడ్ లో నామినేషన్ పక్రియ కొనసాగింది. పునర్నవి భూపాలం ఆవేశంగా తనను తాను నామినేట్ చేసుకోవడం, తమన్నా సింహాద్రి రవికృష్ణ పై వ్యక్తిగత దూషణకు దిగడంతో ఎపిసోడ్ ఆసక్తిగా మారింది.
ఎపిసోడ్ 16( ఆగస్టు 5) హైలైట్స్: నామినేషన్ పక్రియలో పునర్నవి ఆవేశం,తమన్నా సింహాద్రి దూషణ
- ఇంటి సభ్యులలో వితికా, పునర్నవి, మహేష్ విట్టా, శ్రీముఖి నామినేషన్ పక్రియ గురించి మాట్లాడుకున్నారు
- జాఫర్ చేసిన వ్యాఖ్యలపై వరుణ్ సందేశ్ బాబాబాస్కర్ తో మాట్లాడాడు
- ఉదయం సాహో సాంగ్ ప్లే అవ్వగా, ఇంటి సభ్యులు డాన్స్ చేసారు
- ఫ్లోర్ శుభ్రం చేయడం లేదని మహేష్ విట్టా, తమన్నా సింహాద్రిపై ఇంటి కెప్టెన్ వరుణ్ సందేశ్ కి కంప్లైంట్ ఇచ్చాడు
- వరుణ్ సందేశ్ వెళ్లి అడగడంతో, తమన్నా ఇంటిని శుభ్రం చేసింది
- రవికృష్ణ, వితికా కి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు
- మూడోవారం ఎలిమినేషన్ లో భాగంగా, ఒక రబ్బరు స్టాంప్ ఇచ్చి నచ్చని ఇద్దరి సభ్యుల పేర్లు చెప్పి వారిపై స్టాంప్ ముద్ర వేసి నామినేట్ చేయాలనీ బిగ్ బాస్ కోరారు. వరుణ్ సందేశ్ ఇంటి కెప్టెన్ కావడంతో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి మినహాయించారు
నామినేషన్స్ ఈ విధముగా కొనసాగాయి:
- తమన్నా సింహాద్రి – రోహిణి, బాబా భాస్కర్ లను నామినేట్ చేసింది
- రాహుల్ – మహేష్, అలీ లను నామినేట్ చేసాడు
- వితికా – శివజ్యోతి, బాబా భాస్కర్ లను నామినేట్ చేసింది
- మహేష్ విట్టా – రాహుల్, పునర్నవి లను నామినేట్ చేసాడు
- శివజ్యోతి – వితికా, తమన్నా లను నామినేట్ చేసింది
- శ్రీముఖి – రాహుల్, వితికా లను నామినేట్ చేసింది
- అషు రెడ్డి – శ్రీముఖి, తమన్నా లను నామినేట్ చేసింది
- హిమజ – రాహుల్, పునర్నవి లను నామినేట్ చేసింది
- వరుణ్ సందేశ్ – మహేష్, శ్రీముఖి లను నామినేట్ చేసాడు
- బాబా భాస్కర్ – వితికా, పునర్నవి లను నామినేట్ చేసాడు
- రవిక్రిష్ణ – తమన్నా, హిమజ లను నామినేట్ చేసాడు
- అలీ రేజా – తమన్నా, రాహుల్ లను నామినేట్ చేసాడు
- రోహిణి – తమన్నా, పునర్నవి లను నామినేట్ చేసింది
- పునర్నవి – శివజ్యోతి, బాబా భాస్కర్ లను నామినేట్ చేసింది
- అయితే టార్గెట్ చేసి నామినేట్ చేస్తున్నారు అన్న కోపంతో పునర్నవి భూపాలం తనను తాను నామినేట్ చేసుకుంది, ఆవేశంగా మాట్లాడుతూ తనకు ఇంటిలో ఉండాలని లేదని , గ్రూప్ ల పేరుతో నామినేట్ చేయడం ఏంటని ప్రశ్నించింది. తాను ఎవర్ని నామినేట్ చేయక పోతే ఇంటి సభ్యులు అందరిని నామినేట్ చేయాల్సి వస్తుందని బిగ్ బాస్ హెచ్చరించాడు
- పునర్నవి ఎంతకు వినక పోయేసరికి, తనను ప్రతివారం నామినేషన్ ప్రక్రియలో ఉంచుతామని బిగ్ బాస్ చెప్పి, ఆలోచించుకుని తన నిర్ణయం చెప్పాలని కోరతాడు
- వరుణ్ సందేశ్, పునర్నవి తో మాట్లాడి ఎట్టకేలకు ఇద్దరి సభ్యులను నామినేట్ చేసేలా ఒప్పిస్తాడు
- తమన్నా సింహాద్రి, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్ ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నారు
- నామినేషన్ పక్రియ మధ్యలో మరియు పూర్తి అయ్యాక తనను నామినేట్ చేసినందుకు తమన్నా సింహాద్రి రవికృష్ణ పై వ్యక్తిగత దూషణకు దిగింది. ఇంటి సభ్యులు ఎంత చెబుతున్నా వినకుండా తమన్నా రవి కృష్ణను దూషిస్తూనే ఉంది, రవికృష్ణ మాత్రం ఏ విధంగా స్పందించకుండా అలాగే ఉండిపోయాడు
- తరువాత ఎపిసోడ్ లో ఎదో గొడవ జరిగినట్టుంది, పూర్తీ వివరాల కోసం ఈ రోజు ఎపిసోడ్ కోసం ఎదురుచూడాల్సిందే.