టాలీవుడ్ సీనియర్ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. పలు అనారోగ్య కారణాలతో ఆయన ఆదివారం వేకువజామున హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా కృష్ణంరాజు మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి ఆయన ఇంటికి తరలించారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ, సినీరంగ ప్రముఖులు కృష్ణంరాజు ఇంటికి చేరుకుంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ రఘురామకృష్ణరాజు సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకొని కృష్ణంరాజుకు నివాళులు అర్పించారు. వీరితో పాటు హీరోలు, దర్శకులు, నిర్మాతలు సహా ఇతర టెక్నీషియన్స్ కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు.
టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి కృష్ణంరాజు ఇంటికి చేరుకొని ఆయన భౌతికకాయాన్ని దర్శించుకుని నివాళులర్పించారు. కృష్ణంరాజు సతీమణి, ప్రభాస్ తదితర కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇక మరో అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు కూడా కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అలాగే దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు, కేజీఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్, సీనియర్ నటుడు, కృష్ణంరాజు సహచరుడు మురళీ మోహన్, డాన్స్ మాస్టర్ రాజు సుందరం తదితరులు కృష్ణంరాజు భౌతికకాయాన్ని దర్శించుకున్నారు. కాగా రేపు ఉదయం హైదరాబాద్లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY