అల్లు అర్జున్ పుష్ప సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. సమంత ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాటకు సంబంధించి లిరికల్ ఐటెం సాంగ్ వచ్చేసింది. “ఊ అంటావా మావ.. ఊఊ అంటావా” అంటూ సాగే కిర్రెక్కించే పాటను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సాంగ్ లో సమంతా గ్లామర్ షో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అద్భుతంగా ఉంది. ఇంద్రావతి చౌహన్ పాడిన ఈ సాంగ్ యువతను బాగా ఆకట్టుకునేలా ఉంది.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ సరసన రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇంద్రావతి చౌహన్ ఎవరో కాదు.. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ చెల్లెలు. ఇంద్రావతి చౌహన్ కూడా చిన్నప్పటినుంచి జానపద గేయాలు పాడటంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. “బోల్ బేబీ బోల్” షోలో కూడా పాల్గొంది. ఇంద్రావతి పాడిన జార్జి రెడ్డి సినిమాలోని “జాజిమొగులాలి” అనే పాట బాగా పాపులర్ అయింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ