టాలీవుడ్ సీనియర్ దర్శకుడు శరత్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచారు. సుమన్, భానుప్రియ హీరో, హీరోయిన్లుగా నటించిన చాదస్తపు మొగుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆయన తెలుగులో దాదాపు ఇరవై చిత్రాలకు దర్శకత్వం వహించారు. టాలీవుడ్ ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణతో పలు భారీ హిట్ సినిమాలు చేశారు. వంశానికొక్కడు, పెద్దన్నయ్య, సుల్తాన్, వంశోద్ధారకుడు వంటి హిట్ సినిమాలు తీశారు. హీరో సుమన్ తో చాదస్తపు మొగుడు, పెద్దింటి అల్లుడు, బావ-బావమరిది, చిన్నల్లుడు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
90వ దశకంలో తెలుగు ఇండస్ట్రీకి శరత్ మంచి హిట్స్ ఇచ్చారు. మంచి కథాబలం ఉన్న ఇతివృత్తంతో మాస్ హీరోలతో సినిమాలు చేయటం ఆయన ప్రత్యేకత. ప్రత్యేకించి టాలీవుడ్ అగ్రనటుడు బాలకృష్ణతో చాలా హిట్స్ అందుకున్నారు. కాగా శరత్ మృతితో తెలుగు చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రేపు (శనివారం) హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో శరత్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ