ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వి.దొరస్వామి రాజు సోమవారం నాడు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారా హిల్స్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. అన్నమయ్య, సీతారామయ్యగారి మనవరాలు, సింహాద్రి వంటి సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. దాదాపు 750 కి పైగా చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసి, సక్సెస్ ఫుల్ డిస్ట్రిబ్యూటర్గా పేరుగాంచారు. నగరి ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మెంబర్గా కూడా సేవలందించారు. అలాగే సినీపరిశ్రమలో పలు సంస్థలకు ప్రెసిడెంట్ గా కీలక బాధ్యతలు నిర్వహించారు. వి.దొరస్వామి రాజు మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ