రంగుల సినీ ప్రపంచంలో పైకి ఎదగడానికి ట్యాలెంట్, కష్టం ఒకటే సరిపోవు. బోలెడంత లక్ కూడా కలిసి రావాలి. అప్పుడే ఫేమున్న తారలుగా ఓ వెలుగు వెలుగుతారు. ఫేము, నేముతో పాటు గ్లామర్ ప్రపంచంలో కొన్నాళ్ల పాటు పాగా పాతేస్తారు. అలా రానున్న 2024 ఏడాదిలో రిలీజవుతున్న భారీ బడ్జెట్ సినిమాలతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు కొంతమంది హీరోయిన్స్. ఇలా తమ లక్ను పరీక్షించుకోవడానికి వచ్చే ఏడాది రాబోతున్న హీరోయిన్స్ను ఎలా ఆదరిస్తారోనన్న చర్చలు ఫిలిం ఇండస్ట్రీలో జోరుగా నడుస్తున్నాయి.
కొత్త ఏడాదిలోకి సరికొత్త ఆశలతో టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న హీరోయిన్స్ లిస్టులో ఎక్కువ చూపు జాన్వీ కపూర్పైనే ఉంది . అతిలోక సుందరి శ్రీదేవి కూతురు అయని జాన్వీ దేవరతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. అందులోనూ జాన్వీ అభిమాన హీరో ఎన్టీఆర్తో తెలుగులోకి నటిస్తోంది. దేవర సెట్స్ కి వస్తుంటే కొత్త అనే ఫీలింగ్ రావడం లేదని.. తన పుట్టింటికి వచ్చినట్టు అనిపిస్తోందని చెప్పడంతో.. శ్రీదేవి అభిమానులంతా తెగ ఖుషీ అయిపోయారు. శ్రీదేవి తెలుగులో ఓ వెలుగు వెలిగి బాలీవుడ్కు వెళ్లి అక్కడ సెటిల్ అయిపోయింది. కానీ జాన్వీ అక్కడ హీరోయిన్గా కొన్ని సినిమాలు ఇప్పుడు తెలుగులో తన లక్ను పరీక్షించుకోవడానికి వచ్చింది. మరి తల్లి శ్రీదేవి లక్ కూతురుకు ఎంతవరకూ కలిసివస్తుందో చూడాలి.
అలాగే నార్త్ నుంచి జాన్వీ కపూర్ని ఫాలో అవుతున్న మరో హీరోయిన్ మానుషి చిల్లర్. వరుణ్తేజ్తో కలిసి నటిస్తున్న మానుషి తెలుగు ఆడియన్స్ దగ్గర తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. వచ్చే ఏడాది రిలీజ్కి రెడీ అవుతోన్న ఆపరేషన్ వేలంటైన్ మూవీ ద్వారా మానుషి ఎన్ని మార్కులు సంపాదించుకుంటుందో చూడాలి మరి.
మరోవైపు మాస్ మహరాజ్కి జోడీగా, క్లాస్ మహరాణీ అంటూ భాగ్యశ్రీ బోర్సేని మేకర్స్ ఎనౌన్స్ చేశారు. మోడల్గా పేరు తెచ్చుకున్న భాగ్యశ్రీ.. యారియాన్2 సినిమాతో బాలీవుడ్లో మెప్పించింది. ఆమూవీతోనే గ్లామర్డాల్గానే కాకుండా, పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రల్లోనూ మెప్పించగలదన్న గుర్తింపు తెచ్చుకుంది భాగ్యశ్రీ.మరి తెలుగులో రవితేజతో ఎంట్రీ ఎలా కలిసివస్తుందో చూడాలి.
ఇటు 2023లోనే అమిగోష్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీని పలకరించిన ఆషికా రంగనాథ్.. హిట్ అందుకోలేకపోయింది. దీంతో తన ఆశలన్నీ కింగ్ నాగార్జునతో రాబోతున్న నా సామిరంగపైనే పెట్టుకుంది. 2024 జనవరిలో వచ్చే నా సామిరంగతో ఫ్రెష్గా తన కెరీర్ను స్టార్ట్ చేయాలని అనుకుంటోంది. ఆల్రెడీ ఆషికా సాంగ్ మాంచి కిక్కును ఇస్తూ క్లిక్ అయింది. ఇక సినిమా కూడా హిట్ అయితే ఆషికా కొన్నేళ్లు టాలీవుడ్లోనే సెటిలవడానికి కలలు కంటోంది.
అంతేకాదు ఇప్పటివరకూ తెలుగు ఆడియన్స్ను స్పెషల్ సాంగుల్లో అలరించిన నోరా ఫతేహి.. హరిహరవీరమల్లులో పవన్ పక్కన చాన్స్ కొట్టేసింది. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ..2024లో రిలీజ్ని ఫిక్స్ చేసుకోబోతుందని టాక్. దీంతో నోరా హీరోయిన్గా ఎన్ని మార్కులు సంపాదించుకుంటుదో చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE