దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.25 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 1,088 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 13, బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,38,016 కు చేరుకుంది. గత 24 గంటల్లో మరో 26 కరోనా మరణాలు నమోదవడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,21,736కి పెరిగింది. ముఖ్యంగా కేరళ, మిజోరాం, ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
దేశంలో 10,870 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.76 శాతం:
దేశంలో ప్రస్తుతం 10,870(0.03%) యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి. ఇక కొత్తగా 1,081 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు దేశంలో కరోనా బారినపడి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,25,05,410 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతంగా నమోదు కాగా, కరోనా మరణాల రేటు 1.21 శాతంగా ఉంది. అలాగే ఏప్రిల్ 12, మంగళవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 79.49 కోట్లకు చేరుకుంది. ఏప్రిల్ 12న 4,29,323 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ