మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. ఇటీవల ఆ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 7, సోమవారం నాడు కొత్తగా 16,429 కరోనా పాజిటివ్ కేసులు, 423 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,23,641 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య 27,027 కు పెరిగింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో ఒక్క పూణే నగరంలోనే ఇప్పటికి 2,03,468 కేసులు నిర్ధారణ అయ్యాయి.
మహారాష్ట్రలో కరోనా కేసుల వివరాలు (సెప్టెంబర్ 7, సోమవారం నాటికీ):
- రాష్ట్రంలో నిర్వహించిన మొత్తం కరోనా పరీక్షలు – 47,12,017
- రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య – 9,23,641
- డిశ్చార్జ్ అయినవారి సంఖ్య – 6,59,322
- యాక్టీవ్ కేసులు – 2,36,934
- సెప్టెంబర్ 7 న నమోదైన కేసులు – 16,429
- సెప్టెంబర్ 7 న డిశ్చార్జ్ అయినవారు – 14922
- సెప్టెంబర్ 7 న నమోదైన మరణాల సంఖ్య – 423
- మొత్తం మరణాల సంఖ్య – 27,027
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu