దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 1,660 కరోనా కేసులు, 4100 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,18,032 కు చేరుకోగా, మరణాల సంఖ్య 5,20,855 కి పెరిగింది. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో సవరించిన మరణాల గణాంకాలను ప్రకటించడంతో తాజా రోజువారీ మరణాల సంఖ్య ఎక్కువుగా ఉంది. కొత్తగా నమోదైన కేసుల్లో కేరళ, మహారాష్ట్ర, మిజోరాం, ఢిల్లీ, కర్ణాటక, హర్యానా, ఒడిశా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాల్లోనే కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి. మరో 2,349 మంది కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,24,80,436 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.75 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.21 శాతంగా నమోదైంది. కాగా ప్రస్తుతం దేశంలో యాక్టీవ్ కేసులు 20వేల దిగువకు (16,741 – 0.06%) చేరుకున్నాయి.
గత 24 గంటల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలివే (మార్చి 25 (8am)–మార్చి 26 (8am)):
- కేరళ – 543
- మహారాష్ట్ర – 275
- మిజోరాం – 131
- ఢిల్లీ – 112
- కర్ణాటక – 89
- హర్యానా – 73
- ఒడిశా – 55
- రాజస్థాన్ – 52
- ఆంధ్రప్రదేశ్ – 40
- తమిళనాడు – 37
- వెస్ట్ బెంగాల్ – 37
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ