శ్రీలంకలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుధవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రణిల్ విక్రమ సింఘే శ్రీలంక లంక 8వ అధ్యక్షుడిగా ఎంపీలు ఎన్నుకున్నారు. ఈ రోజు జరిగిన ఓటింగ్లో విక్రమ సింఘేకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ క్రమంలో ఉదయం 10 గంటలకు పార్లమెంటు సమావేశమైంది. తొలుత సెక్రటరీ-జనరల్ ధమ్మిక దాసనాయకే రహస్య బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభానికి సంకేతంగా కోరం బెల్ మోగించగా 225 మంది సభ్యులు బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థులకు మద్దతుగా తమ ఓటుని వేశారు. పోలింగ్ అనంతరం కౌంటింగ్ నిర్వహించగా, రణిల్ విక్రమసింఘేకు అత్యధికంగా 134 ఓట్లు వచ్చినట్లు ప్రకటించారు. ఇక పోటీలో నిలిచినా మిగిలిన ఇద్దరు దుల్లాస్కు 82, దిసనాయకేకు మూడు ఓట్లు పోలయ్యాయి. కాగా మాజీ అధ్యక్షుడు రాజపక్స గొటబాయ దేశం విడిచి వెళ్తూ ప్రధాని రాణిల్ విక్రమసింఘేను తాత్కాలిక దేశాధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే. పార్లమెంటులో ఎక్కువ స్థానాలున్న ఎస్ఎల్పీపీ ఆయనకు మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ