ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించారు. ముందుగా రామాయపట్నం పోర్టు ప్రాంతానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ కు పలువురు రాష్ట్ర మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి, అక్కడ నిర్వహించిన భూమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రామాయపట్నం పోర్టు పైలాన్ను కూడా సీఎం ఆవిష్కరించారు. రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించాక, పోర్టు యొక్క ఫొటో ఎగ్జిబిషన్ ను సీఎం వైఎస్ జగన్
తిలకించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు.
రామాయపట్నం పోర్టును మొత్తం రూ.10,640 కోట్లతో రెండు దశల్లో 19 బెర్త్లతో నిర్మించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశ పనులను 36 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ మారిటైం బోర్డు కింద ఈ ప్రాజెక్టును రామాయపట్నం పోర్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించనుంది. తొలిదశ కోసం రూ.3736.14 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. తొలి దశలో భాగంగా కార్గో, బొగ్గు, కంటైనర్ల కోసం నాలుగు బెర్తుల నిర్మాణం జరగనుంది.
రెండో దశలో మిగతా 15 బెర్తుల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పోర్టు ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు సహా రాయలసీమలోని పలు జిల్లాలు, తెలంగాణలోని నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలకు సంబంధించి పారిశ్రామిక, వాణిజ, రవాణా సేవల్లో కీలకం కానుంది. అలాగే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలుప్రాంతాలకు వాణిజ్య, వ్యాపార, రవాణా సేవలు సులభతరం అవ్వనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY