దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు 3 వేలుకు పైగానే నమోదవుతున్నాయి. ప్రస్తుతం 26,976 (0.06%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 3,714 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,31,85,049 కు చేరుకుంది. అలాగే కరోనాతో ఏడుగురు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 5,24,708 కు పెరిగింది. మరో 2,513 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 4,26,33,365 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.72 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.22 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూన్ 7, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య : 85,32,09,262
- జూన్ 6న నిర్వహించిన కరోనా పరీక్షలు : 3,07,716
- మొత్తం పాజిటివ్ కేసులు సంఖ్య : 4,31,85,049
- కొత్తగా నమోదైన కేసులు [జూన్ 6–జూన్ 7 (8AM-8AM)] : 3,714
- నమోదైన మరణాలు : 7
- రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య : 4,26,33,365
- యాక్టీవ్ కేసులు : 26,976
- మొత్తం మరణాల సంఖ్య : 5,24,708
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY