ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా రోజురోజుకి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ విధించడంతో పాటుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే దేశంలో ఏప్రిల్ 16, గురువారం ఉదయానికి 12,380 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ వైరస్ వలన 414 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే ఈ వైరస్ తో పోరాడి 1489 మంది కోలుకుని డిశ్చార్జ్ అయినట్టుగా తెలిపారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో 1000 కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో 1000 కి పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మహారాష్ట్ర : 3,081
- ఢిల్లీ : 1,578
- తమిళనాడు :1,242
- రాజస్థాన్ : 1,101
దేశంలో 500 కి పైగా కరోనా కేసులు నమోదైన రాష్ట్రాలు:
- మధ్యప్రదేశ్ : 980
- గుజరాత్ : 871
- ఉత్తరప్రదేశ్ : 735
- తెలంగాణ : 650
- ఆంధ్రప్రదేశ్ : 534
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]