తెలంగాణ రాష్ట్రంలో డీఐజీలుగా పదోన్నతులు పొందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులకు ఏప్రిల్ 16, గురువారం నాడు పోస్టింగ్లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2006 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఈ ఆరుగురు అధికారులకు ఇప్పటికే డీఐజీ (డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్)లుగా పదోన్నతులు కల్పించారు. అయితే తాజాగా వారికి డీఐజీ ర్యాంకు స్థాయిలో పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీఐజీ స్థాయిలో పదోన్నతి పొందిన వారిలో కార్తికేయ, రమేశ్ నాయుడు, సత్యనారాయణ, సుమతి, శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు ఉన్నారు.
ఆరుగురు ఐపీఎస్ అధికారుల పదోన్నతుల వివరాలు:
- డీఐజీ హోదాలో నిజామాబాద్ పోలీసు కమిషనర్ గా కార్తికేయ కొనసాగింపు.
- డీఐజీ స్థాయిలో రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి పోలీస్ అకాడమీ ఉప సంచాలకులుగా రమేష్ నాయుడుకి బాధ్యతలు.
- డీఐజీ హోదాలో రామగుండం పోలీస్ కమిషనర్గా సత్యనారాయణ కొనసాగింపు.
- సైబరాబాద్ సంయుక్త పోలీస్ కమిషనర్గా వెంకటేశ్వరరావు నియామకం – మాదాపూర్ డీసీపీగా వెంకటేశ్వరరావుకు అదనపు బాధ్యతలు.
- సీఐడీ విభాగంలో డీఐజీగా సుమతి కి బాధ్యతలు.
- సీఐడీ విభాగంలో డీఐజీగా శ్రీనివాసులకు బాధ్యతలు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]