- బెంగాల్లో 200 పైగా స్థానాల్లో టీఎంసీ ఆధిక్యం, 89 స్థానాల్లో బీజేపీ, ఒక స్థానంలో లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి.
- తమిళనాడులో 135 స్థానాల్లో డీఎంకే ఆధిక్యం.
- కేరళలో 88 స్థానాల్లో ఎల్డీఎఫ్ ముందంజ.
- అస్సాం 80, పుదుచ్చేరిలలో 12 స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఆధిక్యం.
- పశ్చిమబెంగాల్లో టీఎంసీ పార్టీ ముందంజలో ఉంది. అయితే నందిగ్రామ్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కంటే 8 వేల ఓట్ల వెనుకంజలో ఉన్నారు.
- తమిళనాడు రాష్ట్రంలో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.
- కేరళలో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డిఎఫ్ 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
- అస్సాం, పుదుచ్చేరిలలో బీజేపీ నేతృత్వంలోని కూటమి ఆధిక్యంలో ఉంది.
దేశంలో పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు రాష్ట్రాలతో సహా శాసనసభ కలిగిన కేంద్రపాలితమైన పుదుచ్చేరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. తమిళనాడులో 234, పశ్చిమబెంగాల్ లో 294, కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకుంది. మరోవైపు దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఫలితాలు అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ