తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ఫలితాల్లో అధికార వైఎస్సార్సీపీ పార్టీ ఆధిపత్యం కొనసాగుతుంది. ప్రస్తుతానికి వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.గురుమూర్తి 61,482 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పక్రియ ఈ రోజు ఉదయం ప్రారంభమైంది. తిరుపతి లోక్సభ పరిధిలోని సూళ్లూరుపేట, గూడూరు,వెంకటగిరి, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ నెల్లూరు డీకే గవర్నమెంట్ మహిళా కళాశాలలో, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో జరుగుతుంది. ఈ ఉపఎన్నికలో మొత్తం 17 లక్షల 10 వేల ఓట్లకు గాను 64.42 శాతం అనగా 10 లక్షల 90 వేల ఓట్లు పోలయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. తుదిపలితం సాయంత్రం 4 గంటలలోగా వెలువడే అవకాశం ఉంది.
తిరుపతి పోరులో 28 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థిగా ఎం.గురుమూర్తి, టీడీపీ తరుపున పనబాక లక్ష్మీ, బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ అధికారిని రత్నప్రభ ఈ ఉపఎన్నికల్లో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీల కీలక నేతలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఈ ఉపఎన్నికపై ప్రజల్లో ఆసక్తి నెలకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ