దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. కొత్తగా 600 లోపే రోజువారీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 547 పాజిటివ్ కేసులు, 1 మరణం నమోదైంది. 2020, ఏప్రిల్ 06 తర్వాత మళ్ళీ అతి తక్కువ కేసులు నమోదవడం ఇదే. దీంతో నవంబర్ 14, సోమవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,66,924 కు, మరణాల సంఖ్య 5,30,532 కి పెరిగింది.
అలాగే మరో 3,385 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,26,924 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.79 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో 9,468 (0.02%) మంది చికిత్స పొందుతున్నారు. ఇక దేశంలో గత 24 గంటల్లో 68334 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 0.80 శాతంగా నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE