భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ 9 వ స్థానంలో నిలిచింది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 7466 కరోనా పాజిటివ్ కేసులు, 175 కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో అత్యధికంగా ఒకేరోజు ఇంతపెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అయితే గత 8 రోజులుగా దేశంలో ప్రతిరోజూ 6 వేలకు పైగానే కొత్త కేసులు నిర్ధారణ అవుతూనే ఉన్నాయి. మే 29, శుక్రవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,65,799 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4706 కి చేరింది. కరోనా మరణాలలో భారత్ చైనాను దాటింది. అధికారిక లెక్కల ప్రకారం చైనాలో ఇప్పటివరకు 4634 కరోనా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో కరోనా బాధితుల్లో 71,106 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ప్రస్తుతం 89,987 మంది కరోనా లక్షణాలతో ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu