తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 66 స్థానిక కేసులు కాగా, సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారు 49 మంది, వలస కార్మికులు ఇద్దరు ఉన్నారు. కొత్తగా నమోదైన 66 కేసులతో కలిపి మే 28, గురువారం సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1908 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 67 కి చేరినట్టు ప్రకటించారు.
ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 175 కి చేరుకుంది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారిలో ఇప్పటిదాకా 143 మందికి, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో మరో 30 మందికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు పేర్కొన్నారు. ఈ 348 కేసులతో కూడా కలిపి రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,256కి చేరింది. కాగా ఇప్పటికే ఈ వైరస్ నుంచి కోలుకుని 1345 మంది సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 844 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 28.05.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe pic.twitter.com/abUiDSIJl4
— Eatala Rajender (@Eatala_Rajender) May 28, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu