దేశంలో మంగళవారం ఉదయానికి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,52,28,996 కు చేరుకోగా, మరణాల సంఖ్య 2,78,719 కు పెరిగింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,63,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం 4,22,436 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. దేశంలో ఒకే రోజులో 4 లక్షలకు పైగా కరోనా బాధితులు రికవరీ నమోదవడం ఇదే తొలిసారి. మరోవైపు కొత్తగా నమోదయిన 2,63,533 కేసులలో దేశంలోని కేవలం 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల నుండే 75 శాతం నమోదయ్యాయి.
కొత్త కేసుల్లో 75 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- కర్ణాటక – 38603
- తమిళనాడు – 33075
- మహారాష్ట్ర – 26616
- కేరళ – 21402
- వెస్ట్ బెంగాల్ – 19003
- ఆంధ్రప్రదేశ్ – 18561
- రాజస్థాన్ – 11597
- ఒడిశా – 10757
- ఉత్తర్ ప్రదేశ్ – 9345
- హర్యానా – 7488
మరోవైపు గత 24 గంటల్లో 4329 మరణాలు నమోదవగా దేశంలోని 10 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలోనే 76 శాతం నమోదయ్యాయి.
4329 మరణాల్లో 76 శాతం నమోదైన 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే :
- మహారాష్ట్ర – 1000
- కర్ణాటక – 476
- ఢిల్లీ – 340
- తమిళనాడు – 335
- ఉత్తరప్రదేశ్ – 271
- ఉత్తరాఖండ్ – 223
- పంజాబ్ – 191
- రాజస్థాన్ – 157
- ఛత్తీస్ గడ్ – 149
- వెస్ట్ బెంగాల్ – 147
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ