దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 2,63,533 కరోనా కేసులు నమోదవడంతో మే 18, మంగళవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,52,28,996 చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 4,329 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 2,78,719 కి పెరిగింది. దేశంలో ఇప్పటివరకు ఒకరోజు వ్యవధిలో ఈ స్థాయిలో (4,329) కరోనా మరణాలు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో రెండో స్థానంలో, అత్యధిక మరణాలు నమోదైన దేశాల్లో మూడో స్థానంలో భారత్ కొనసాగుతుంది.
దేశంలో 33 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 85.60 శాతం:
ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. ఇక దేశంలో ప్రస్తుతం 33,53,765 (13.29%) యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కొత్తగా 4,22,436 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 2,15,96,512 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 85.60 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.10 శాతంగా ఉంది. ఇక మే 17, సోమవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 31,82,92,881 కు చేరుకుంది. గత 24 గంటల్లో 18,69,223 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ