రాజ్యసభ వ్యవహారాలకు సంబంధించి నూతన స్టాండింగ్ కమిటీల నియామకం జరిగింది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నవంబర్ 2వ తేదీన తీసుకున్న నిర్ణయం మేరకు తాజాగా వివరాల బులెటిన్ ను విడుదల చేశారు. ఈ కమిటీలలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలకు చోటు కల్పించారు. ఈ మేరకు ఛైర్మన్ జగదీప్ ధన్కర్ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 9 కమిటీలకు గానూ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన 7గురు ఎంపీలు చోటు దక్కించుకున్నారు. త్వరలోనే ఈ ఎంపీలు ఆయా కమిటీలలో బాధ్యతలు స్వీకరించనున్నారు.
రాజ్యసభ రాజ్యసభ సెక్రటేరియట్ నూతన స్టాండింగ్ కమిటీల చోటు దక్కించుకున్న ఎంపీలు..
- బిజినెస్ అడ్వైజరీ మరియు ఎథిక్స్ కమిటీలు – కే కేశవరావు (టీఆర్ఎస్) మరియు వై విజయసాయి రెడ్డి (వైఎస్సార్సీపీ)
- కమిటీ ఆన్ రూల్స్ – కే లక్ష్మణ్ (బీజేపీ)
- కమిటీ ఆన్ ప్రివిలైజెస్ – జీవీఎల్ నరసింహారావు (బీజేపీ)
- కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లషన్ – కేఆర్ సురేష్ రెడ్డి (టీఆర్ఎస్)
- హౌజ్ కమిటీ ఛైర్మన్ – సీఎం రమేష్ (బీజేపీ)
- హౌజ్ కమిటీ మెంబర్ – బి లింగయ్య (టీఆర్ఎస్)
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE