తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా సోమా భరత్ కుమార్ ను నియమిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు సోమా భరత్ కుమార్ నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవీలో సోమా భరత్ కుమార్ రెండేళ్ల పాటుగా కొనసాగనున్నారు. ఈ నేపథ్యంలో డెయిరీ కార్పొరేషన్ చైర్మన్గా తన నియామక ఉత్తర్వులను భరత్ కుమార్ సోమవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ చేతులమీదుగా అందుకున్నారు. తనకు అవకాశమిచ్చినందుకు సీఎం కేసీఆర్ కు భరత్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా ఉన్న సోమా భరత్కుమార్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE