తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు, పోస్టింగ్లు జరిగాయి. పలు జిల్లాలకు సంబంధించి మొత్తం 14 మంది అదనపు కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు:
- జోగులాంబ గద్వాల జిల్లా అడిషన్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా అపూర్వ్ చౌహాన్ నియమకం
- వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా అశ్విని తానాజీ వాంఖడే, బీ.హరి సింగ్ బదిలీ
- వరంగల్ లో ఇప్పటివరకు పని చేసిన బీ.హరి సింగ్ను తదుపరి పోస్టింగ్ కోసం సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ముందు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బీ.రాహుల్
- నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా మయాంక్ మిట్టల్, కందూరి చంద్రారెడ్డి బదిలీ
- నారాయణపేటలో ఇప్పటివరకు పని చేసిన కందూరి చంద్రారెడ్డిని తదుపరి పోస్టింగ్ కోసం సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ముందు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా మంద మకరందు నియామకం, జల్దా అరుణశ్రీ బదిలీ
- జగిత్యాలలో ఇప్పటివరకు పని చేసిన జల్దా అరుణశ్రీని తదుపరి పోస్టింగ్ కోసం సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ముందు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా ప్రఫుల్ దేశాయ్ నియామకం, అబ్దుల్ హమీద్ బదిలీ
- జనగామలో ఇప్పటివరకు పని చేసిన అబ్దుల్ హమీద్ను తదుపరి పోస్టింగ్ కోసం సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ముందు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా అభిషేక్ అగస్త్య నియామకం, డి.జాన్ సాంసన్ బదిలీ
- మేడ్చల్ మల్కాజ్గిరిలో ఇప్పటివరకు పని చేసిన డి.జాన్ సాంసన్ ను తదుపరి పోస్టింగ్ కోసం సంబంధిత అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ముందు రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- నల్గొండ జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా కుష్బూ గుప్తా నియామకం, రాహుల్ శర్మ బదిలీ
- వికారాబాద్ అడిషన్ కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా రాహుల్ శర్మ నియామకం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE