దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 94 లక్షలకు చేరువైంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 42,810 కరోనా కేసులు, 496 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 93,92,919 కు, మరణాల సంఖ్య 1,36,696 కు చేరుకుంది. కాగా దేశంలో ప్రస్తుతం 4,53,956 మంది బాధితులు కరోనాకు చికిత్స పొందుతున్నారు
మరోవైపు కొత్తగా 42,298 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 88,02,267 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 93.71 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.46 శాతంగా ఉంది. ఇక నవంబర్ 29 నాటికీ దేశంలో నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 14 కోట్లకుపైగా (13,95,03,803) చేరువైంది. గత 24 గంటల్లోనే 12,83,449 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ