ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 80 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా కర్నూల్ జిల్లాలో 31, గుంటూరు జిల్లాలో 18, చిత్తూరు జిల్లాలో 14, అనంతపూర్, తూర్పు గోదావరి జిల్లాలలో 6 చొప్పున, ప్రకాశం, కృష్ణా లలో 2 చొప్పున, విశాఖపట్నంలో ఒకటితో కలిపి మొత్తం 80 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 893 పాజిటివ్ కేసులకు గాను 141 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు ఈ వైరస్ వలన 27 మంది మరణించారు. ప్రస్తుతం 725 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏప్రిల్ 22, బుధవారం నాటికి 943కి చేరిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుధవారం నాడు కొత్తగా 15 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. మొత్తం 943 పాజిటివ్ కేసులకు గాను 24 మంది మృతి చెందగా, 194 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ప్రకటించారు. ప్రస్తుతం 725 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 80 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 893 పాజిటివ్ కేసు లకు గాను 141 మంది డిశ్చార్జ్ కాగా, 27 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 725. #APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/QxvmihvyBP— ArogyaAndhra (@ArogyaAndhra) April 23, 2020
Media bulletin on status of positive cases of #COVID19 in Telangana (Dated: 22.04.2020) pic.twitter.com/4A0662pCq5
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 22, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu