ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19(కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రియాద్లోని భారత రాయబార కార్యాలయం సమాచారం ప్రకారం సౌదీ అరేబియాలో మొత్తం 11మంది భారతీయులు కరోనా వైరస్ బారినపడి మరణించారు. “ఏప్రిల్ 22, బుధవారం నాటికి రాయబార కార్యాలయానికి లభించిన సమాచారం ప్రకారం, మదీనాలో నలుగురు, మక్కాలో ముగ్గురు, జెడ్డాలో ఇద్దరు, రియాద్లో మరియు దమ్మాంలో ఒక్కొక్కరు మరణించారని” ప్రకటన విడుదల చేశారు.
సౌదీలో భారతీయులకు అవసరమైన ఆహారం, మందులు మరియు ఇతర అత్యవసర వస్తువుల సరఫరాపై ఇప్పటికే వివిధ రకాల కార్యక్రమాలు అమలులో ఉన్నాయని, భారత పౌరుల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని అధికారులు తెలిపారు. కరోనా వైరస్కు సంబంధించిన సమాచారం కోసం సౌదీ ఆరోగ్యశాఖ యొక్క టోల్ఫ్రీ నెంబర్ 937ను అక్కడి భారతపౌరులు సంప్రదించవచ్చని తెలిపారు. మరోవైపు సౌదీ అరేబియాలో ఇప్పటివరకు 13,930 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, ఈ వైరస్ వలన 121మంది ప్రాణాలు కోల్పోయారు.
Embassy of India Press Release pic.twitter.com/NH9uZ827pT
— India in SaudiArabia (@IndianEmbRiyadh) April 23, 2020
Embassy of India, Riyadh COVID-19 Emergency Helplines pic.twitter.com/QXX19y7dJi
— India in SaudiArabia (@IndianEmbRiyadh) March 23, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu