ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏప్రిల్ 24, శుక్రవారం నాడు ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకాన్ని ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ఈ పథకాన్నిప్రారంభించి నగదు బదిలీ చేశారు. దీంతో సెర్ప్, మెప్మాల పరిధిలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్ఎంఎస్ ద్వారా ఒకే విడతగా డబ్బులు జమ అయ్యాయి. ఈ పొదుపు సంఘాల్లో 90,37,254 మంది మహిళలు సభ్యులుగా ఉండగా వారికీ చెందిన సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడతలో జమ అయినట్టు తెలిపారు.
అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా డ్వాక్రా మహిళలతో సీఎం వైఎస్ జగన్ సంభాషించారు. కరోనా సంక్షోభం కారణంగా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో కూడా సీఎం వైఎస్ జగన్ అండగా నిలవడం పట్ల పొదుపు సంఘాల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu