బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు పెంపుపై తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు గురువారం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బార్ బాడీలు సదరు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీనిలో భాగంగా హైకోర్టు జడ్జీల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ 67 ఏళ్లకు పెంచేందుకు ఈ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు అన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్స్ దీనికి ఆమోదం తెలిపాయి. అలాగే ఇది కార్యరూపం దాల్చడానికి రాజ్యాంగ సవరణను కోరుతూ ఈ తీర్మానంలో ప్రతిపాదనలు పెట్టారు. సమావేశం ఏకగ్రీవంగా రాజ్యాంగంలో తక్షణ సవరణ చేయాలని అభిప్రాయపడింది.
కాగా ప్రస్తుతం ట్రయల్ కోర్టు జ్యుడీషియల్ అధికారులు 60, హైకోర్టు జడ్జీలు 62 మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 65 సంవత్సరాల వయస్సులో పదవీ విరమణ పొందుతున్నారు. ఇక ఉన్నత న్యాయవ్యవస్థలోని న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సును పెంచాలని బార్ నాయకులు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత వారం జరిగిన అన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్లు, హైకోర్టు బార్ అసోసియేషన్లు మరియు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆఫీస్ బేరర్లు సంయుక్త సమావేశంలో హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు పెంపునకు సంబంధించి సమస్యను చర్చించారు. అలాగే వివిధ కమీషన్లు మరియు ఇతర ఫోరమ్లకు అనుభవజ్ఞులైన న్యాయవాదులను కూడా చైర్పర్సన్లుగా నియమించేలా వివిధ చట్టాలను సవరించాలని పార్లమెంటుకు ప్రతిపాదించాలని కూడా ఉమ్మడి సమావేశంలో నిర్ణయించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY