ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఫిబ్రవరి నెలలో భారత్ లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 5, 2021 నుంచి మార్చి 28, 2021 వరకు జరగబోతే ఈ పర్యటనలో ఇంగ్లాండ్ తో భారత జట్టు 4 టెస్టులు, 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో భారత్-ఇంగ్లాండ్ సిరీస్ను చెన్నై, అహ్మదాబాద్, పూణే వేదికల్లో మాత్రమే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో జరిగే తొలి రెండు టెస్టు మ్యాచులకు సంబంధించిన భారత జట్టును అఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ మంగళవారం సమావేశమై ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది.
కొంత విరామం తరువాత కెప్టెన్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టు పగ్గాలు చేపట్టబోతున్నాడు. కోహ్లీతో కలిపి మొత్తం 18 మంది ఆటగాళ్లను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఆస్ట్రేలియా టూర్ లో ఆశించినంతగా రాణించని పృథ్వి షా జట్టులో చోటు కోల్పోయాడు. అలాగే గాయాల నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్, ఇషాంత్ శర్మ జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లకు కూడా జట్టులో స్థానం లభించింది.
భారత్ టెస్టు జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్.
నెట్ బౌలర్లు: అంకిత్ రాజ్పూత్, అవెష్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణప్ప గౌతమ్, సౌరభ్ కుమార్.
స్టాండ్బై ప్లేయర్స్: కెఎస్ భరత్, అభిమన్యు ఈశ్వరన్, షాబాజ్ నదీమ్, రాహుల్ చాహర్, ప్రియాంక్ పంచల్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ