ఇంగ్లాండ్ తో చివరి రెండు టెస్టులకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ

17 Member Team India Squad, 17 Member Team India Squad for Last Two Tests Against England, bcci, BCCI Announces 17 Member Team India Squad, IND v ENG 2021, Ind vs Eng, India vs England 2021, India vs England Match, India vs England Match News, India vs England Test Series, India vs England Test Series 2021, Mango News, Team India Squad, Team India Squad India vs England

భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్‌ ప్రస్తుతానికి 1-1 తో సమం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు (డే/నైట్) ఫిబ్రవరి 24 నుంచి, నాలుగో టెస్టు మార్చి 4 నుంచి అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ లో జరిగే చివరి రెండు టెస్టు మ్యాచులకు సంబంధించిన భారత జట్టును అఖిల భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ బుధవారం సమావేశమై ఎంపిక చేసినట్టు బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 17 మందితో కూడిన ఆటగాళ్ల జాబితాను ప్రకటించారు.

అలాగే ఫిట్‌నెస్ అంచనా తర్వాత ఉమేష్ యాదవ్ అహ్మదాబాద్‌లో జట్టుతో చేరనున్నాడని తెలిపారు. విజయ్ హజారే ట్రోఫీ కోసం శార్దుల్ ఠాకూర్ ను, స్టాండ్ బై ప్లేయర్స్ గా ఉన్న అభిమన్యు ఈశ్వరన్, షాబాజ్ నదీమ్, ప్రియాంక్ పంచల్ ను విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక చివరి రెండు టెస్టుల కోసం ఐదుగురు నెట్ బౌలర్లను, ఇద్దరు స్టాండ్‌బై ప్లేయర్స్ ను కమిటీ ఎంపిక చేసింది.

భారత్ టెస్టు జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, చటేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), జస్ప్రీత్‌ బుమ్రా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌, ఇషాంత్ శర్మ, కుల్‌దీప్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, మహ్మద్ సిరాజ్.

నెట్ బౌలర్లు: అంకిత్ రాజ్‌పూత్, అవెష్ ఖాన్, సందీప్ వారియర్, కృష్ణప్ప గౌతమ్, సౌరభ్ కుమార్.

స్టాండ్‌బై ప్లేయర్స్: కెఎస్ భరత్, రాహుల్ చాహర్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − three =