భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2020–2021 సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కొత్త కాంట్రాక్ట్లను గురువారం నాడు ప్రకటించింది. అక్టోబర్ 2020 నుండి సెప్టెంబర్ 2021 వరకు టీమ్ ఇండియా (సీనియర్ మెన్)కు ఈ కాంట్రాక్టులు వర్తించనున్నాయి. A+, A, B, C గ్రేడ్ల కింద మొత్తం 28 మంది ఆటగాళ్ల వార్షిక వేతనాల కాంట్రాక్టులను బీసీసీఐ వెల్లడించింది. ఏడాదికి రూ.7 కోట్లు చొప్పున చెల్లించే A+ గ్రేడ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ, పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. ఇక A గ్రేడ్ కింద రూ.5 కోట్లు, B గ్రేడ్ కింద రూ.3 కోట్లు, C గ్రేడ్ కింద రూ.కోటి చొప్పున ఆటగాళ్లకు చెల్లించనున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.
కొత్త కాంట్రాక్ట్ ల జాబితా:
A+ గ్రేడ్ కాంట్రాక్ట్ :
- విరాట్ కోహ్లీ
- రోహిత్ శర్మ
- జస్ప్రీత్ బుమ్రా
A గ్రేడ్ కాంట్రాక్ట్ :
- చటేశ్వర్ పుజారా
- అజింక్య రహానె
- శిఖర్ ధావన్
- రవిచంద్రన్ అశ్విన్
- రవీంద్ర జడేజా
- రిషభ్ పంత్
- హార్దిక్ పాండ్య
- కేఎల్ రాహుల్
- మహమ్మద్ షమి
- ఇషాంత్ శర్మ
B గ్రేడ్ కాంట్రాక్ట్ :
- మయాంక్ అగర్వాల్
- భువనేశ్వర్ కుమార్
- శార్దూల్ ఠాకూర్
- వృద్ధిమాన్ సాహా
- ఉమేశ్ యాదవ్
C గ్రేడ్ కాంట్రాక్ట్ :
- శ్రేయస్ అయ్యర్
- శుభ్మన్ గిల్
- హనుమ విహారి
- వాషింగ్టన్ సుందర్
- యుజువేంద్ర చాహల్
- కుల్దీప్ యాదవ్
- నవ్దీప్సైని
- దీపక్ చాహర్
- అక్షర్ పటేల్
- మహ్మద్ సిరాజ్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ