దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. వరుసగా రెండో రోజు కూడా 2 లక్షలకుపైగానే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో 2,17,353 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 2,17,353 కేసుల్లో 61,695 కేసులు ఒక్క మహారాష్ట్ర రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఏప్రిల్ 16, శుక్రవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917 కు చేరింది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 1185 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,74,308 కు చేరుకుంది.
దేశంలో 15 లక్షలకు పైగా యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 87.80 శాతం:
ముఖ్యంగా మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు వంటి 10 రాష్ట్రాల్లోనే రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 15,69,743 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 1,18,302 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 1,25,47,866 కు చేరుకోగా, కరోనా రికవరీ రేటు 87.80 శాతంగా నమోదైంది. కరోనా మరణాల రేటు 1.22 శాతంగా ఉంది. ఇక ఏప్రిల్ 16, శుక్రవారం నాటికీ దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షలు సంఖ్య 26,34,76,625 కు చేరుకుంది. గత 24 గంటల్లో 14,73,210 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ